ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 30,886 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 4,198 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,646కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో  9,317 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,94,369 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 88,364 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,317 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 88,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,646కు చేరింది. 


దేశంలో కరోనా కేసులు


24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1, 49, 394 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య పదమూడు శాతం తగ్గింది. ఇరవై నాలుగు గంటల్లో  1.072 మంది వైరస్‌ బారిన పడి చనిపోయారు. 2, 46, 674 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా వెలుగు చూసిన కేసులతో కలిసి దేశవ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పటి వరకు డెత్‌ టోల్‌ 5,00,055లుగా ఉంది. రోజూవారిగా ఉండే పాజిటివిటీ రేటు 9.27శాతం ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 12.03 శాతంగా ఉంది. 


దేశవ్యాప్తంగా నిన్న 16,11,666 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 168.47కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు వేశారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో గత 24 గంటల్లో 1,956 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో క్రియాశీల కేస్‌లు 15,632. మిజోరంలో రోజువారీ పాజిటివిటీ రేటు 30.91%కి చేరుకుంది. మహారాష్ట్రలో 15,252 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. 75 మరణించారు. తమిళనాడులో 11,993  కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33,87,322కి చేరుకుంది. 30 మరణాలతో మొత్తం మృతులు సంఖ్య 37,666కి చేరుకుంది. కేరళలో గురువారం కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. 42,677 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 61,72,432కి చేరుకుంది.