Food Poison in Kadapa Yogi Vemana University Hostel: కడపలోని (Kadapa) యోగి వేమన వర్శిటీలోని (Yogi Vemana Versity) హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి విద్యార్థులు కూర, రసంతో అన్నం తిన్నారు.  ఆ తర్వాత వారు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన యూనివర్శిటీ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అటు, ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.


Also Read: టీడీపీ పాలనలో పులివెందులకు నీళ్లు- జగన్ హయాంలో కుప్పానికి జలాలు- ఇదే స్ఫూర్తి రాష్ట్రమంతటా ఉంటే..