టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోమవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కనిపించాడు కోహ్లీ.

తను లేనప్పుడు తన హోటల్ గదిని వీడియో తీసినందుకు విరాట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

హోటల్ గదిలో విరాట్‌ లేనప్పుడు కొంతమంది అభిమానులు గదిలోకి ప్రవేశించారు.

అక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో విరాట్ రియాక్ట్‌ అయ్యాడు.

విరాట్ కోహ్లీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెలబ్రిటీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానం అదుపులో ఉంటేనే ఆనందంగా ఉంటుందని లేకుంటే ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, డేవిడ్ వార్నర్ వంటి ప్రముఖులు విరాట్ చేసిన ఈ పోస్ట్‌పై స్పందించారు.

హోటల్ సిబ్బందే ఈ పని చేసినట్లు తర్వాత తెలిసింది.
(All Images Credits: BCCI)