టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది.

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లతో ఓటమి పాలైంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఎయిడెన్ మార్క్రమ్ (52), డేవిడ్ మిల్లర్ (59 నాటౌట్) అర్థ సెంచరీలు సాధించారు.

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కూడా విఫలం అయింది.

క్వింటన్ డికాక్ (1), టెంబా బవుమా (10), రిలీ రౌసో (0) త్వరగా అవుట్ అయ్యారు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ రెండు, షమీ, హార్దిక్, అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఈ విజయం దక్షిణాఫ్రికా టేబుల్ టాప్‌కు చేరుకుంది.

పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టం అయ్యాయి.