రిలయన్స్ జియో 5జీ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ మనదేశంలో అత్యంత చవకైన ఫోన్ అయ్యే అవకాశం ఉంది.

దీని ధర రూ.9 వేల నుంచి రూ.12 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

దేశంలో 1,000 నగరాల్లో 5జీ కవరేజ్ అందించాలని జియో ప్లాన్ చేస్తుంది.

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది.

ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు.