సాంబ్రాణి ధూపం ఏరోజు వేస్తే ఎలాంటి ఫలితమో తెలుసా..

పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల్లో ధూపం ఒకటి. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెబుతారు జ్యోతిష్యులు. దేఇల్లంతా ధూపం వేయడం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా..ఆరోగ్యానికి కూడా మంచిదంటారు.

ఆదివారం గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేస్తే.. సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.

సోమవారం ధూపం వేస్తే ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

మంగళవారం శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటికి సంబంధించిన సమస్యలుండవు, అప్పుల బాధ తొలగిపోతుంది.

బుధవారం ధూపం వేస్తే.. నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటూ పెద్దల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి, అన్నింటా విజయం అందుకుంటారు

శనివారం సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.

ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు కానీ పూర్వం సాంబ్రాణి, సుద్ధచందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో, గుగ్గిలంలోనో వెలిగించే వారు. ఇలా చేస్తే ఇంట్లో, పరిసరాల్లో ఉండే దోమలు, సూక్ష్మ క్రిములు ఈ పొగకి నశిస్తాయి.

హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి..ఈ పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు. శ్వాస సంబంధిత రుగ్మతలు లేకుండా చేస్తుంది.

శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది సాంబ్రాణి

ఆయుర్వేదం లో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.

ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందులతో పాటూ కొన్ని లేహ్యాల్లోనూ సాంబ్రాణి ఉపయోగిస్తారు.

దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.