30 ఏళ్లక్రితమే రాజుకున్న జ్ఞానవాపి వివాదం



ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వారణాసిలో జ్ఞానవాపి వివాదం మూడు దశాబ్దాల క్రితమే మొదలైంది... మరి మధ్యలో బ్రేక్ పడి ఇప్పుడెందుకు రాజుకుందంటే...



కాశీ విశ్వనాథుడి ఆలయం కూల్చేసి ఆ స్థానంలో మసీదు కట్టారని 1991 అక్టోబర్ 15న పండిట్ సోమ్‌నాథ్‌ వ్యాస్, డాక్టర్ రామ్‌రంగ్‌ శర్మతో పాటు పలువురు వారణాసి కోర్టును ఆశ్రయించారు.



మసీదు ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించి పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పట్లో కోర్టును కోరారు. అదే సమయంలో మసీదు తరుపున అంజుమన్ ఇంతెజామియా స్టే కోర్టుతూ హైకోర్టును ఆశ్రయించింది.



వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆ కేసు 1998 వరకు పెండింగ్‌లోనే ఉండిపోయింది.



2019లో సుప్రీం కోర్టు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. మరోసారి జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. న్యాయవాది విజయ్‌ శంకర్‌ రస్తోగీ కొత్త పిటిషన్ వేశారు.



మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించాలని కోరారు. 2021 ఏప్రిల్‌ 8న కోర్టు ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌ బోర్డు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే ఇచ్చింది.



జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరి గణపతి, హనుమంతుడి విగ్రహాలకు నిత్యపూజలు జరిపించే అవకాశం ఇవ్వాలని విశ్వ వేదిక్‌ సనాతన్‌ సంఘ్‌ తరుపున ఐదుగురు మహిళలు గతేడాది కోర్టులో పిటిషన్ వేశారు. వీడియోగ్రఫీని డిమాండ్ చేశారు.



ఈ పిటిషన్‌ను అంగీకరిస్తూ కోర్టు జ్ఞాన్‌వాపి మసీదు సర్వే జరపాలని, వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది. మసీదు ప్రాంగంణంలో ఉన్న బావిలో నీటి స్థాయిని తగ్గించి చూస్తే అక్కడ శివలింగం గుర్తించారు.



తాము చెప్పిందే నిజమైందని హిందువులు...మరో మసీదు కోల్పోయేందుకు సిద్ధంగా లేమని ముస్లిం సంఘాలు స్ట్రాంగ్ గా స్పందిస్తున్నాయ్.



ఇన్నేళ్ల తర్వాత భగ్గుమంటున్న ఈ వివాదానికి ఎలాంటి ఫుల్ స్టాప్ పడుతుందో వెయిట్ అండ్ సీ....
(Images Credit: Pinterest)