ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది శ్రియా శరన్.
దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి తన సత్తా చాటింది.
యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉండేది.
ఇప్పటికీ తన హాట్ ఫోటోలతో అందరినీ అలరిస్తుంటుంది.
రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం అవుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ నటిగా మరింత బిజీ అవుతుంది.
రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.
ఇప్పుడు ఈ బ్యూటీ తన కూతురితో కలిసి గోవాకు చెక్కేసింది.
అక్కడ తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.