ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో శిక్షణ కోసం అప్రెంటిస్‌ల దరఖాస్తులను ఆహ్వానించింది.

రైల్వే ఆర్ఆర్సీ(RRC) తూర్పు మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్ 2022, ఏసీటీ అప్రెంటీస్ పోస్టులు- 756 ఈస్ట్ సెంట్రల్ రైల్వే దరఖాస్తులు ఆహ్వానించింది.

దరఖాస్తులు ప్రారంభ తేదీ - 08-ఫిబ్రవరి-2022 కాగా, చివరి తేదీ 07-మార్చి-2022, ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ - 07-మార్చి-2022.

జనరల్ / OBC అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. SC / ST / PH / మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.

అభ్యర్థుల వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 24 సంవత్సరాలు కన్నా మించకూడదు.

గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వైకల్యం ఉన్న వ్యక్తులకు, గరిష్ట వయోపరిమితి 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు ఒక యూనిట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వేర్వేరు డివిజన్లకు వివిధ దరఖాస్తులు సబ్మిట్ చేస్తే పరిగణలోకి తీసుకోరు.

అప్లైయ్‌ చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. అలాగే పూర్తి వివరాలకు https://rrcbbs.org.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Thanks for Reading. UP NEXT

100 టెస్టు: విరాట్‌ కన్నా ముందే ఆడిన ఇండియన్స్

View next story