కార్మిక భవిష్య నిధి సంస్థ (EPFO) త్వరలో తన లక్షలాది ఖాతాదారులకు కొత్త సౌకర్యం కల్పిస్తోంది.

PF ఉపసంహరణ కోసం ఇకపై ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

కొత్త వ్యవస్థ కింద ఉద్యోగులు UPI ని ఉపయోగించి నిమిషాల్లోనే తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు.

ఈ మార్పు EPFO కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ CITES 2.0 (EPFO 3.0) ద్వారా అమలు చేస్తారు.

ఆ మొత్తం ప్రక్రియను మునుపటి కంటే వేగంగా, సులభంగా , మరింత పారదర్శకంగా చేస్తుంది.

ప్రస్తుతం ఉద్యోగులు తమ PF ఉపసంహరణ కోసం రోజులు తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది.

వినియోగదారులు వారి UANతో లాగిన్ అయి OTP ద్వారా ధృవీకరిస్తే చాలు

వారి UPI ID ని నమోదు చేయడం ద్వారా వారి బ్యాంక్ ఖాతాకు తక్షణ నిధులు బదిలీ అవుతాయి.

ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుండి గరిష్టంగా 75 శాతం డబ్బును మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు.

ఖాతాలో కనీసం 25 శాతం మొత్తం ఉంచడం తప్పనిసరి.

ప్రస్తుతం EPFOలో దాదాపు 798 మిలియన్ సభ్యులు , 82 మిలియన్లకు పైగా పెన్షనర్లు ఉన్నారు.