రోజుకు ఒక పండు(Fruit) తింటే చాలు అంటోన్న క్యాన్సర్ డాక్టర్.. ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri

మంచి ఆరోగ్యం చిన్న అలవాట్లతోనే ప్రారంభమవుతుందని ఆంకాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ వర్తి తెలిపారు.

ఆరోగ్యం కోసం పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక పండు తినడం వంటి చిన్న అలవాటుగా మార్చుకోండి.

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర పనితీరుకు అవసరం.

నారింజ, జామ, కివీ వంటి పండ్లు ఇమ్యూనిటీని బలోపేతం చేసి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

చిప్స్, బిస్కెట్లు, జంక్ ఫుడ్ బదులుగా పండ్లు తినడం వల్ల అదనపు కేలరీలు, చక్కెరలు తగ్గుతాయి.

పండ్లలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించవచ్చు.

పండ్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో తరచుగా తినాలనే కోరిక తగ్గే అవకాశం ఉంటుంది.

పండ్లలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.

వంటగదిలో లేదా డైనింగ్ టేబుల్‌పై పండ్లు ఉంచితే వాటిని తినడం గుర్తుండి అలవాటు సులభంగా ఏర్పడుతుంది.

బ్యాగ్‌లో ఒక పండు ఉంచుకోవడం వల్ల ఆకలి వేసినప్పుడు ఆరోగ్యకరమైన ఎంపిక అందుబాటులో ఉంటుంది.

రోజుకు ఒక పండు తినడం చిన్న విషయంగా అనిపించినా.. ఎక్కువ కాలం కొనసాగిస్తే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగవుతాయి.