అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి.

ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది.

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది.

తాజాగా చీరకట్టుకొని ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.

గులాబీ రంగు చీరలో జాన్వీ ఆకట్టుకుంటోంది.