ఐఎన్ఎస్ ఆండ్రోత్ (INS Androth) యుద్ధ నౌకను సోమవారం విశాఖపట్నంలో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు త్రివిధ దళాలు చేపట్టిన బృహత్తర కార్యాచరణలో ఈ నౌక కమిషనింగ్ ఒక భాగం
అండ్రోత్ పెట్యా క్లాస్ కార్వెట్లలో రెండవ నౌకగా నిర్మించారు
ఈ యుద్ధ నౌకలను ‘మేకిన్ ఇండియా’ ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలలో భాగంగా దేశీయంగా తయారు చేశారు.
ఐఎన్ఎస్ ఆండ్రోత్, ఐఎన్ఎస్ అర్నాలా నౌకలు దేశంలో తయారైన తొలి జలాంతర్గాముల వ్యతిరేక వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లు (ASW-SWC) శ్రేణికి చెందినవి.
ఈ శ్రేణిలోని తొలి నౌక అయిన ఐఎన్ఎస్ అర్నాలాను ఈ సంవత్సరంలో జూన్ 18న భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది.
ఐఎన్ఎస్ అర్నాలా, ఐఎన్ఎస్ ఆండ్రోత్ను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీరింగ్ (జీఆర్ఎస్ఈ) సంస్థ నిర్మించింది.
ఈ నౌకల ప్రధాన విధి లోతు తక్కువగా ఉండే సముద్ర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, వాటిని ధ్వంసం చేస్తుంది.
ఐఎన్ఎస్ ఆండ్రోత్ పేరు లక్షద్వీప్లోని ఒక ద్వీపకల్పం నుంచి తీసుకోగా, ఐఎన్ఎస్ అర్నాలా పేరు మహారాష్ట్రలోని ఒక చారిత్రక కోటను సూచిస్తుంది.
సముద్ర నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడంలో ఈ నౌకలు కీలకమైన పాత్ర పోషిస్తాయి.
ఈ వాటర్ క్రాఫ్ట్లు డీజిల్ ఇంజిన్, వాటర్ జెట్ కాంబినేషన్తో పనిచేస్తాయి, ఇంకా వీటిలో ఆధునిక సెన్సార్ వ్యవస్థలు అత్యాధునిక ఆయుధాలు పొందుపరిచారు.