ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణలో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు

జూలై 27 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్

మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు

భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

రాయలసీమ జిల్లాల్లోనూ 4 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి

భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు