ధనుష్ వర్సెస్ నయనతార - అసలేం జరిగింది? ప్రముఖ హీరో, నిర్మాత ధనుష్కు నయనతార రాసిన ఓపెన్ లెటర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన కంటెంట్ ఉపయోగించడానికి ధనుష్ ఒప్పుకోలేదని అందులో పేర్కొన్నారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకు ధనుషే నిర్మాతగా వ్యవహరించారు. రెండు సంవత్సరాలు ధనుష్ ఎన్ఓసీ కోసం తాము ఎదురుచూసినట్లు నయన్ తన లేఖలో పేర్కొన్నారు. ధనుష్ ఎన్ఓసీ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆ కంటెంట్ లేకుండానే డాక్యుమెంటరీ విడుదల అయింది. ట్రైలర్లో ‘నానుమ్ రౌడీ దాన్’ షూటింగ్కు సంబంధించి మూడు సెకన్ల క్లిప్ను ఉపయోగించారు. దానికి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించినట్లు నయన్ తన లెటర్లో తెలిపారు. కనీసం సాంగ్స్ నుంచి లిరిక్స్ కూడా ఉపయోగించడానికి వీల్లేదని ధనుష్ చెప్పడం తన హృదయాన్ని బద్దలు చేసిందని నయన్ అన్నారు. మరి దీనికి ధనుష్ ఏం రిప్లై ఇస్తారో చూడాల్సి ఉంది.