క్రిస్మస్ కి ఈ నాలుగు రంగులు చాలా ప్రత్యేకం



క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిలు, ఇళ్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం, ప్రార్థనలు చేయడం, కొత్తబట్టలు ధరించడం, శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణ



క్రిస్మస్ అలంకరణ, ముఖ్యంగా ట్రీ అలంకరణలో అయితే ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, బంగారం రంగు..ఈ రంగులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్నిరంగులుండగా ఈ నాలుగు రంగులనే ఎందుకు ప్రత్యేకంగా వినియోగిస్తారో చూద్దాం..



ఎరుపు రంగు
క్రిస్మస్ వేడుకల్లో ఎరుపు రంగును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇది బిషప్, శాంతా క్లాజ్ దుస్తుల రంగు. ఇది యేసు రక్తాన్ని , తన త్యాగాన్ని సూచించే రంగుగా విశ్వసిస్తారు. ఎరుపు..ఇతరులపట్ల ప్రేమకు చిహ్నం. ప్రేమ ఉన్నచోట ఆనందం ఉంటుంది.



ఆకుపచ్చ రంగు
ఏసుక్రీస్తు శిలువవేసినప్పటి నుంచీ ప్రజల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడని విశ్వసిస్తారు. ఈ రంగు కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. శీతాకాలంలో కూడా మొక్కలు తమ రంగును కోల్పోవు కాబట్టి, రోమన్లు ​​ఈ రంగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.



బంగారం రంగు
ఈ రంగు దేవుడు ప్రపంచానికి ఇచ్చిన బహుమతికి సూచన. ఈ రంగును ఉపయోగించడం వెనుకున్న ఆంతర్యం ఆనందాన్ని పంచుకోవడం. బంగారు రంగు పూర్వపు సంపదకు చిహ్నంగా భావిస్తారు...అందుకే అదృష్టాన్ని ఆకర్షించేందుకు ఇంటి అలంకరణలో ఈ రంగుని ఉపయోగిస్తారు.



తెలుపు రంగు
శాంతి స్వచ్ఛతకు చిహ్నమైన తెలుపురంగు.. శీతాకాలంలో కురుస్తున్న మంచును కూడా సూచిస్తుంది. అందుకే క్రిస్మస్ ట్రీ అలంకరణలో తెలుపు రంగు బదులు..పత్తిని ఉపయోగిస్తారు. విశ్వాసం, జీవితంలో ప్రకాశానికి కూడా తెలుగు సూచన



క్రిస్మస్ ని ఓ మతపరమైన పండుగగా కాకుండా ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకునే వేడుకగా చూస్తే అందరూ జరుపుకోవచ్చేమో.



ముఖ్యంగా ఇంటి అలంకరణ పాజిటివ్ వైబ్రేషన్స్ ని, ప్రశాంతతని ఇస్తుంది..అందుకే క్రైస్తవులు మాత్రమే కాదు ట్రీ అలంకరణ ఆసక్తి ఉన్నవారు ఎవ్వరైనా చేయొచ్చు..



Images Credit: Freepik