నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,633 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 122 పాయింట్లు ఎగిసి 62,969 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 124 పాయింట్లు పెరిగి 44,436 వద్ద స్థిరపడింది.



ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్ ఫిన్‌షర్వ్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి.



అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.71 వద్ద స్థిరపడింది.



కిలో వెండి రూ.77000 వద్ద కొనసాగుతోంది.



బంగారం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.60,550గా ఉంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.27,240 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.26 శాతం తగ్గి రూ.22.98 లక్షల వద్ద కొనసాగుతోంది