చాణక్య నీతి: తల్లిదండ్రులు ఇలాచేస్తే పిల్లలు ఎప్పటికీ బాగుపడరు



ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్రం, రాజకీయాలతో పాటు, పాపం, పుణ్యం, కర్తవ్యం, ధర్మం, అధర్మం గురించి తన నీతిశాస్త్రంలో ప్రస్తావించాడు..



ఆచార్య చాణక్య తెలిపిన జీవిన విధానాల్లో తల్లిదండ్రుందరూ గుర్తుంచుకోవాలంటూ కొన్ని సూచనలు చేశాడు



వివేకవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే సద్గుణాలతో కూడిన విద్యను అందించాలి. మంచి గుణాలు కలిగిన వ్యక్తి సమాజంలో గౌరవాన్ని అందుకుంటాడు.



చిన్నతనంలో పిల్లల మనసులో మంచి అనే బీజాలు నాటితే వారు సత్ప్రవర్తనతో మెలుగుతారు.



పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని చెప్పాడు చాణక్యుడు.



ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారు తప్పనిసరిగా చెడిపోతారు



పిల్లలు చేసే తప్పును నిర్లక్ష్యం చేసినవారు, వారిని మందిలించి తప్పు అని చెప్పని తల్లిదండ్రులు..పిల్లల్ని చెడుమార్గంలో వేలుపట్టిన నడిపిస్తున్నట్టే



ముద్దుపేరుతో పిల్లల భవిష్యత్ ని చిదిమేస్తున్న తల్లిదండ్రులు ఆ తర్వాత పశ్చాత్తాప పడినా ఫలితం ఉండదన్నాడు చాణక్యుడు



కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో చాణక్యుడు చెప్పిన మాటలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి.



ముఖ్యంగా మనుషుల వ్వవహారశైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి.