Latha Mangeshkar: గాయని లతా మంగేష్కర్ కు కరోనా...ముంబై బీచ్ క్యాండీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్

లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే... అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లతా మంగేష్కర్‌కు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ... ఆమె వయసు రీత్యా ఐసీయూకు షిఫ్ట్ చేశారు. కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటితో పాటు ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని వైద్యులు నిశితంగా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. లతా మంగేష్కర్ న‌వంబ‌ర్‌, 2019లో బ్రీతింగ్ ప్రాబ్ల‌మ్స్‌, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఓసారి ఆస్పత్రి పాలయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola