Variety temple Tradition in Kadapa: కడప జిల్లాలోని ఓ ఆలయంలో వినూత్న ఆచారం
కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయ స్వామి ఆలయంలో వందల ఏళ్లుగా వెరైటీ ఆచారం కొనసాగుతోంది. సాధారణంగా చాలా చోట్ల స్వామివారికి పొంగళ్లను ఆడవారు సమర్పిస్తారు. కానీ అక్కడ అసలు ఆడవారికి ప్రవేశమే లేదు. అన్నీ మగవారే చేస్తారు. సుమారు 1516 సంవత్సరం నుంచి ఈ ఆచారం కొనసాగుతుందట. సంక్రాంతికి ముందుగా వచ్చే ఆదివారం రోజున వేడుకగా స్వామి వారికి పొంగళ్లు సమర్పిస్తారు. మొన్న కూడా ఈ వేడుక సందడిగా జరిగింది.