గుజరాత్ లోని వడోదరా పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్ర కేసు నమోదు అయింది. వివాహం జరిగిన ఎనిమిదేళ్లకు ఓ మహిళ తన భర్త పురుషుడే కాదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండానే ప్రైవేట్ భాగాలకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడని, ఆ విషయం తనకు తెలియకుండా దాచి పెట్టాడని ఆరోపించింది. అలాగే తనతో అసహజ శృంగారం, మోసం, అభియోగాల కింద బాధితురాలి.. భర్తపై గత బుధవారం గోత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయం దాచి పెళ్లి చేసినందుకు అత్తింటి వారి పేర్లు కూడాఆమె ఫిర్యాదులో చేర్చారు. వివాహ సంబంధాల వైబ్ సైట్ ద్వారా పరిచయమైన వీరిద్దరికీ 2014 ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. 


ఆ తర్వాత హనీమూన్ కోసం వారిద్దరూ కశ్మీర్‌కు కూడా వెళ్లారు. కానీ భర్త మాత్రం ఆమెకు దూరంగానే ఉన్నాడు. ఏమైందని భార్య పదే పదే అడగ్గా.. రష్యాలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తాను శృంగార సామర్థ్యం కోల్పోయినట్లు సమాధానం వచ్చింది. ఆ తర్వాత 2020లో పొట్ట తగ్గేందుకు సర్జరీ అని కోల్ కతాకు వెళ్లిన తన భర్త.. పురుష అవయవాల కోసం శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెతో అసహజ శృంగారం ప్రారంభించిన అతడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ భర్తను దిల్లీలో అరెస్ట్ చేసి.. వడోదరాకు తీసుకు వచ్చినట్లు గోత్రి పోలీసులు వెల్లడించారు. 


ఇటీవలే ఫోలోవర్స్ ను పెంచుకునేందుకు భార్య స్నానం చేసే వీడియో..!


సోషల్ మీడియా పెరిగిన ఈ కాలంలో చాలా మంది వాటిలోనే మునిగి తేలుతున్నారు. తమ టాలెంట్ ను ఉపయోగించి వీడియోలు చేస్తూ అందులో పోస్టు చేస్తారు. ఫాలోవర్స్ ను ఆకట్టుకునేందుకు చాలా రకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఇందులో కొన్ని విపరీతమైన ధోరణితో ఉంటాయి. కొందరు లైకులు, షేర్లు, కామెంట్లు పెరగడం కోసం ఎలాంటి వీడియోలైనా తీసేందుకు వెనకాడరు. దిల్లీ ఉత్తమ్ నగర్ లో నివాసముండే 28 ఏళ్ల వ్యక్తి.. ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఒక దారుణమైన పని చేశాడు. ఆ వ్యక్తి చేసిన ఆ పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


అంతలా ఏం చేశాడు..?


న్యూ దిల్లీలో ఉత్తమ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు 28 ఏళ్ల వ్యక్తి. తనకు సోషల్ మీడియా అంటే విపరీతమైన పిచ్చి. ఎప్పుడూ అందులోనే మునిగి తేలుతాడు. తన పేజీలో వివిధ రకాలు వీడియోలు పోస్టు చేస్తాడు. అలా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో పడ్డాడు. ఎంతకీ ఫాలోవర్స్ పెరగకపోవడంతో ఒక దారుణమైన పని చేశాడు. ఆ 28 ఏళ్ల వ్యక్తికి గతంలోనే పెళ్లి జరిగింది. అతను దిల్లీలో ఉంటుంటే.. అతని భార్య మాత్రం ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఉంటుంది. ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజు స్నానం చేస్తుండగా వీడియో కాల్ మాట్లాడుకుందామంటూ భార్యను బలవంతం చేశాడు. అతని ఒత్తిడి తట్టుకోలేని ఆ మహిళ చివరికి తను చెప్పిందే చేయాల్సి వచ్చింది. స్నానం చేస్తూ భర్తతో వీడియో కాల్ మాట్లాడింది. 


అలా వీడియో కాల్ మాట్లాడుతుండగా దానిని రికార్డు చేశాడు భర్త. ఫేస్ బుక్ లో తన పేజీకి ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఆ వీడియోను వాడుకోవాలని అనుకున్నాడు. తన పేజీలో తన భార్య స్నానం చేస్తున్నప్పటి వీడియోను పోస్టు చేశాడు. దాంతో పాటు ఆమె వ్యక్తిగత ఫోటోలను కూడా పెట్టడం ప్రారంభించాడు. 


అలా దొరికిపోయాడు.. 


ఒక రోజు ఫేస్ బుక్ చూస్తుండగా.. తన వ్యక్తిగత ఫోటోలను గమనించిన భార్య.. భర్తను నిలదీసింది. ఆ ఫోటోలను, వీడియోను తీసేయమని అడిగింది. దానికి అతడు ఒప్పుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫేస్ బుక్ కంపెనీని ఆశ్రయించి నిందితుడి ఫేస్ బుక్ పేజీని, ఖాతాను తొలగించారు.