Man Murder: వివాహేతర సంబంధాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయనే సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుత కాలంలో అయితే మరీనూ. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని.. కన్నబిడ్డల నుంచి కట్టుకున్న వాళ్ల దాకా ఎవర్ని చంపడానికైనా ఆలోచించట్లేరు జనాలు. అయితే భార్యతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి... రెండేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఇద్దరూ కలిసి స్థానికంగా ఉండే ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఇష్టం వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేసేవాళ్లు. అతడు ఆమెకు డబ్బులు కూడా ఇచ్చేవాడు. అయితే తాజాగా వీరిద్దరూ లాడ్జికి వెళ్లి గడిపారు. అనంతరం ఆమె డబ్బులు అడిగింది. ఈ విషయంలోనే వీరిద్దరికీ గొడవ జరిగింది. దీంతో మహిళ ఇతడిని గట్టిగా నెట్టేసింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 


అర్ధరాత్రి హత్య, ఉదయం పరార్..!


చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డి (50) రెండేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో వచ్చిన మనస్పర్థల కారణంగా గ్రామంలో ఉండలేక చిత్తూరుకు చేరుకున్నాడు. అక్కడే కూరగాయలు, తినుబండారాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడే అతడికి లలిత అనే మహిళ పరిచయం అయింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే బుధవారం రోజు వీరిద్దరూ సుందరయ్య వీధిలోని లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత డబ్బుల విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్ రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్ర గాయమైంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గుర్తించిన లలిత తీవ్రంగా భయపడిపోయింది. ఏం చేయాలో తెలియాక గురువారం ఉదయమే.. హోటల్ రూంకు తాళం వేసి రిసెప్షన్ లో ఇచ్చి పరారైంది. 


మధ్యాహ్నం లాడ్జిని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరిచి చూడగా.. ఈశ్వర్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఈశ్వర్ రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అయితే లాడ్జి గదిని లలిత పేరు మీద బుక్ చేయడంతో పాటు పోలీసుల పని సులభతరమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితురాలని పట్టుకున్నారు. అసలేం జరిగిందని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేసింది లలిత. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


నెల్లూరులో వదినతో అక్రమ సంబంధం.. హత్య చేసిన అన్న!


తమ్ముడి వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూడటంతో సొంత తమ్ముడ్ని హత్య చేశాడు అన్న. ఈ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకుంది సొంత అన్న భార్యతోనే కావడం ఇక్కడ విశేషం. తాను ఇంటికి వచ్చే సరికి తన భార్య తమ్ముడితో కలసి ఉండటం చూసిన భర్త కోపోద్రిక్తుడై వెంటనే తమ్ముడిపై దాడి చేశాడు. కర్రతో తలపై కొట్టాడు. ఆ దెబ్బలకి తమ్ముడు అక్కడే రక్తపు మడుగులో పడిపోయి చనిపోయాడు. చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో ఈ ఘటన జరిగింది.