1500 Kgs Big Fish Caught By Machilipatnam Fishermen: కృష్ణా జిల్లా మచిలీపట్నం (Machilipatnam) మత్స్యకారులకు ఆదివారం ఓ భారీ చేప చిక్కింది. గిలకలదిండి వద్ద సముద్రంలో దాదాపు 1500 కేజీల టేకు చేప  వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. బాహుబలి చేపను ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరకు సాధ్యం కాక క్రేన్ సాయంతో తరలించారు. భారీ చేపను చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. టేకు చేపలు అత్యంత అరుదుగా దొరుకుతాయని.. ఆయుర్వేద మందుల తయారీకి ఈ చేపను వాడతారని మత్స్యాకారులు తెలిపారు. చెన్నైకు చెందిన వ్యాపారులు ఈ బాహుబలి చేపను కొనుగోలు చేసినట్లు చెప్పారు. కాగా, ఇంతటి భారీ చేపను తరలిస్తోన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Continues below advertisement


Also Read: Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం