Uppal MLA :  టిక్కెట్ ఇవ్వకపోగా తనను కనీసం పిలిచి మాట్లాడలేదని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఉరి తీసేవారికైనా చివరి కోరిక ఏమిటని అడుగుతారని.. కానీ తనను ఏమీ అడగలేదని.. ఆయన కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో మీడియాలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  
2001 నుండి ఉద్యమంలో పని చేశానని..బీఆర్ఎస్ తరపున  ఉప్పల్ లో జెండా పట్టిన మొదటి నాయకుడిని చెప్పుకున్నారు.  నాకు తెలిసిన పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ ఒక్కటే.. అప్పటి నుండీ కేసీఆర్ నాయకత్వంలోనే నడుస్తున్నానన్నారు.  2008 నుండి ఉప్పల్ ఇంచార్జీ గా ఉన్నానని గుర్తు చేశారు.  ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడ లేదు..  అన్ని బై ఎలక్షన్స్ కుంపని చేశాననన్నారు.  


తనకు   బాధ్యతలు ఇచ్చిన దగ్గర పని చేశానని..  ఉద్యమ సమయంలో బంద్ కు పిలుపునిస్తే రాత్రి వచ్చి పోలీసులు తీసుకుపోయే వార్నారు.  2014 లో కేసీఆర్   టికెట్ ఇచ్చారని..  అప్పుడు ఓడి పోయినా ప్రోత్సహించి పనిచేయమన్నార్నారు.  2016 జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 10 సీట్లకు 9 సీట్లు గెలుచుకున్నామమని గుర్తు చేశారు.  ప్రతీ రోజు జనంలోనే ఉన్నాను. పార్టీలకతీతంగా నేనుంపని చేశాను. ఉప్పల్ టికెట్ వేరే వారికి ఇచ్చారు. అతను పార్టీకి ఏమి చేశాడని ప్రస్నించారు.  కాంగ్రెస్ , టిడిపి పొత్తులో సీటు పోతే బి ఆర్ ఎస్ పార్టీలో చేరారని విమర్శించారు.  
సి ఎస్ ఆర్ డబ్బులను బి ఎల్ ఆర్ ట్రస్ట్ పేరుతో పంచుతున్నారు, తప్ప పార్టీకి ఏమి చేయలేదన్నారు. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 29 నియోజక వర్గాల్లో తాను, పద్మారావు మాత్రమే ఉద్యమకారులమని..   ఏం తప్పు చేశానని టికెట్ ఇవ్వలేదని భేతి  సుభాష్ రెడ్డి ప్రశ్నించారు.  పార్టీలో ఉద్యమకారులు ఉండకూడదా అని ప్రశఅనించారు.  టికెట్ లు ప్రకటించి వారమైన  పై నుండి పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏం చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు  అధిష్టానం ఏమి చెప్పనిది, కార్యకర్తలకు ఏమి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తనను ఎందుకు బలి చేశారో తెలియడంలేదన్నారు. 


జూన్ 15న మంచిగా పని చేసుకో అని పార్టీ చెబితే పాదయాత్ర చేశానని.. 30 రోజుల పాదయాత్ర లో ఎవరు నన్ను అడ్డుకోలేదన్నారు.  కొన్ని చోట్ల మంత్రులను కుడా అడ్డుకున్నారని..  టికెట్ రాకున్నా కార్యకర్తల్ని సంయమనం పాటించాలని కోరానన్నారు.  ఉరి తీసేవాడిని కూడా ఆఖరి కోరిక అడుగుతారని కానీ అలాంటి ప్రయత్నం కూడా  బీఆర్ఎస్‌లో చేయలేదన్నారు.  ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తులు అమ్ముకున్నాననని అవినతికి పాల్పడలేదన్నరు. ఇంకా వేచి చూస్తున్నాను. మార్పులు జరుగుతున్నాయి అని అనుకుంటున్నానని..  అధిష్టానం  తనను కలవకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


వారం పది రోజులు వేచి చూసిన  ర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని.   నా ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.  ప్రజల ఆలోచనా మేరకే పని చేస్తానని.. బి ఫారం ఇచ్చే లోపు ఏమైనా జరుగుతాయి అని కేసీఆర్ గారి అన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.