తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 95,355 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 3,590 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,58,566కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,085కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 40,447 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 3,555 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,14,034కి చేరింది. 


ఏపీలో కోవిడ్ కేసులు


ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 40,357 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 11,573 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,594కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 9,445 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,30,162 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,15,425 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,60,181కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,445 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,15,425  యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,594కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,24,06,132 శాంపిల్స్ పరీక్షించారు. 


దేశంలో కరోనా కేసులు


భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే దేశంలో దాదాపు 10 వేల పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,35,532 (2 లక్షల 35 వేల 532)  మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 871 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రెండు రోజుల కిందట నమోదైన కేసులతో పోల్చితే పోల్చితే దేశంలో కరోనా మరణాలు 50 శాతం పెరిగాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 కోట్లు దాటిపోయింది. దేశంలో నిన్న ఒక్కరోజులో 3,35,939 (3 లక్షల 35 వేల 939) మంది కరోనాను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333కు దిగొచ్చింది. భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే తగ్గాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 165.04 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది.  


Also Read: పాము కాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు... పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు...