సామాన్యుల వాహనంపై ఒక్క చలానా పెండింగ్ లో ఉంటే బండి స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఈ రూల్ సామాన్యులకే పరిమితమా... అధికారంలో ఉన్నవాళ్లకు, అధికారులకు వర్తించవా అంటున్నారు ప్రజలు. ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఉన్నతాధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనంపై  ఏకంగా 28 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి


గత కలెక్టర్ల సమయంలో చలానాలు 


సామాన్యుల వాహనాలకు ఒకటి, రెండు చలాన్లు పెండింగ్ లో ఉంటే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డుపై ఆపి మరి చలానాలు కట్టించుకుంటున్నారు. అదే జిల్లా కలెక్టర్ వాహనంపై 28 చలానాలు ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు, అధికారులకు నిబంధనలు వేరుగా ఉంటాయా అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. సామాన్యులు తమ చలానాలను ఇంటికి వెళ్లి కడతామని చెప్పినా, పోలీసులను వేడుకున్నా వదలకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కానీ ఒక జిల్లా కలెక్టర్ వాహనానికి 28 చలానాలు పెండింగ్ లో ఉంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో 28 చలానాల్లో 15 చలానాలు చెల్లించారు అధికారులు. ప్రస్తుతం కలెక్టర్ వాహనంపై 13 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ చలానాలు గతంలో కలెక్టర్లుగా వ్యవహరించిన సత్యనారాయణ, శరత్ సమయంలో పడినట్లు తెలుస్తోంది. 


Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష


వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు


ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం (TS16 EE3366)పై 28 చలానాలు పడ్డాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 మధ్య ఈ మొత్తం చలానాలు పడ్డాయని తెలుస్తోంది. ఈ చలానాలకు రూ.27,580 జరిమానా పడింది. ఇందులో అధిక వేగంతో వాహనం నడపడం వల్ల 24 చలానాలు పడ్డాయి. ఈ వార్త వైరల్‌ అవ్వడంతో 15 చలానాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇంకా కలెక్టర్ వాహనంపై 2019 నుంచి 2021 ఆగస్టు వరకు 13 చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. ఈ చలానాలకు మొత్తం రూ.12,100 నగదు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు జనగామ జిల్లా కలెక్టర్ వాహనంపై 23 చలానాలు పడ్డాయి. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనంపై 2021 ఆగస్టు 30వ తేదీ వరకు 23 చలానాలు పడ్డాయి. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


Also Read:  ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి