Election Counting Centers in Telangana: తెలంగాణలో (Telangana Elections 2023) పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM) నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ (Postal Ballot Counting) తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


























Also Read: LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం