తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. రెండ్రోజులుగా ఢిల్లీలో మేథో మథనం అనంతరం 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. అలాగే, హుజూరాబాద్ నుంచి కూడా బరిలో నిలవనున్నారు. కరీంనగర్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు.


52 మంది అభ్యర్థులు వీరే



  • కరీంనగర్ - బండి సంజయ్ కుమార్

  • హుుజురాబాద్ - ఈటల రాజేందర్

  • గజ్వేల్ - ఈటల రాజేందర్

  • సిర్పూర్ - పాల్వాయి హరీశ్ బాబు

  • బెల్లంపల్లి (ఎస్సీ) - అమరాజుల శ్రీదేవి

  • ఖానాపూర్ (ఎస్టీ) - రమేశ్ రాథోడ్

  • ఆదిలాబాద్ - పాయల్ శంకర్

  • బోథ్(ఎస్టీ) - సోయం బాపూరావ్

  • నిర్మల్ - ఆలేటి మహేశ్వర్ రెడ్డి

  • ముథోల్ - రామరావు పటేల్

  • ఆర్మూర్ - పైడి రాకేశ్ రెడ్డి

  • జుక్కల్ (ఎస్సీ) - టి.అరుణతార

  • కామారెడ్డి - వెంకటరమణారెడ్డి

  • నిజామాబాద్ అర్బన్ - సూర్యనారాయణ గుప్తా

  • బాల్కొండ - ఆలేటి అన్నపూర్ణమ్మ

  • కోరుట్ల - ధర్మపురి అర్వింద్

  • జగిత్యాల - బోగ శ్రావణి

  • ధర్మపురి(ఎస్సీ) - ఎస్.కుమార్

  • రామగుండం - కందుల సంధ్యారాణి

  • చొప్పదండి(ఎస్సీ) - బొడిగే శోభ

  • సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి

  • మానకొండూరు (ఎస్సీ) - ఆరెపల్లి మోహన్

  • నర్సాపూర్ - ఎర్రగొల్ల మురళీ యాదవ్

  • పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్

  • దుబ్బాక - రఘునందన్ రావు

  • కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్

  • ఇబ్రహీంపట్నం - నోముల దయానంద్ గౌడ్

  • మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

  • ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

  • కార్వాన్ - అమర్ సింగ్

  • గోషామహల్ - రాజాసింగ్

  • చార్మినార్ - మేఘారాణి

  • చంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్

  • యాకుత్ పుర- వీరేందర్ యాదవ్

  • బహుదూర్ పుర - వై నరేశ్ కుమార్

  • కల్వకుర్తి - టి.ఆచారి

  • కొల్లాపూర్ - ఎ.సుధాకార్ రావు

  • నాగార్జున సాగర్ - కంకణాల నివేదితా రెడ్డి

  • సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వరరావు

  • భువనగిరి - గూడురు నారాయణ రెడ్డి

  • తుంగతుర్తి - కడియం రామచంద్రయ్య

  • జనగామ - ఆరుట్ల దశమంత్ రెడ్డి

  • స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) -  డాక్టర్ గుండే విజయరామారావు

  • పాలకుర్తి - లేగ రామ్మోహన్ రెడ్డి

  • డోర్నకల్ (ఎస్టీ) -  భుక్యా సంగీత

  • మహబూబాబాద్ (ఎస్టీ) -  జతోత్ హుస్సేన్ నాయక్

  • వరంగల్ వెస్ట్ - రావు పద్మ

  • వరంగల్ ఈస్ట్ - ఎర్రబెల్లి ప్రదీప్ రావు

  • వర్థన్నపేట (ఎస్సీ) - కొండేటి శ్రీధర్

  • భూపాలపల్లి - చందుపట్ల కీర్తిరెడ్డి

  • ఇల్లెందు (ఎస్టీ) - రవీందర్ నాయక్

  • భద్రాచలం (ఎస్టీ) - కుంజా ధర్మారావు.


12 మంది మహిళలకు చోటు


తొలి జాబితాలో 12 మంది మహిళకు బీజేపీ అధిష్ఠానం చోటు కల్పించింది. అలాగే, 20 మంది బీసీలు, 18 మంది ఓసీలు, 8 మంది ఎస్టీలు, 6 స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ జాబితాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణలు, ఇతర పార్టీల అభ్యర్థులను ఎదుర్కొనేలా అభ్యర్థులను బరిలో నిలిపింది. కాగా, టికెట్లు ఆశించిన కొందరు నేతల పేర్లు ఇందులో కనిపించలేదు.


Also Read: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత - గోషామహల్ నుంచే పోటీ