Four Died in Collapsed Church in Sangareddy: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహిర్ (Kohir) లో ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా చెక్కలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులు మయన్మార్, నేపాల్ కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.


Also Read: Minister Seethakka: అలాంటివారు ఇంటికి పోవడమే - మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్!