SCCL: కరోనాతో మరణించిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ప్రత్యేక ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 26వ తేదీన జరిగిన అగ్రిమెంట్ ప్రకారం మిగిలిన అంశాల అమలు కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. సింగరేణిలో కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ కార్మికుల మాదిరిగా 15 లక్షల రూపాయలు ప్రత్యేక ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేసిన నిరవధిక సమ్మే పలితంగా సింగరేణి యాజమాన్యం శనివారం నాడు సర్క్యూలర్ విడుదల చేసింది. దాని ప్రకారం 2020 మార్చి తర్వాత కరోనా వల్ల మరణించిన కాంట్రాక్టు కార్మికులకు 15 లక్షల ఎక్స్ గ్రే షియో చెల్లిస్తారని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు.






కొత్తగూడెం ఏరియాలోని ఆర్ సీహెచ్పీ వద్ద కాంట్రాక్ట్ కార్మికులతో శనివారం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెల 26వ తేదీన యాజమాన్యంతో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ లోని విషయాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జరిగిన అగ్రిమెంట్ ప్రకారం యాజమాన్యం కరోనా మరణానికి 15 లక్షల ప్రత్యేక సర్క్యులర్ ను విడుదల చేసిందన్నారు. దాని ప్రకారం సరైన ఆధారాలతో స్థానిక ఏరియా అధికారులకు సమర్పించాలని, దాని ఆధారంగా 15 లక్షల రూపాయలను చెక్కు రూపంలో నామినీలుగా వ్యక్తులకు బ్యాంకు ఖాతాలో చెల్లిస్తారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం అగ్రిమెంట్ లో ఉన్న అంశాల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.


అగ్రిమెంటులోని అంశాలను అమలు చేయడం ద్వారా కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉన్న గందరగోళ పరిస్థితిని నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్య నారాయణ, యర్రగాని కృష్ణయ్య, ఇనుపనూరి నాగేశ్వరరావు, కిషోర్, బి వీరు, బోలా సింగ్, శ్రీను, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


దసరా సందర్భంగా కేసీఆర్ కానుక..


తెలంగాణ పెద్ద పండుగ దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ సింగ‌రేణి ఉద్యోగుల‌కు శుభవార్త చెప్పారు. సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్రక‌టించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విజయదశమి లోపు ఈ వాటా మొత్తాన్ని ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. 368 కోట్ల రూపాయలను అర్హులైన ఉద్యోగులకు సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది.


గత ఆర్థిక సంవత్సరం లాభాల్లో వాటా..


2021 -22 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సింగరేణి ఉద్యోగులకు అందించనున్నారు. ఈ మొత్తాన్ని సింగరేణిలో అర్హులైన ఉద్యోగులకు, సిబ్బందికి దసరా కానుకగా అందించాలని  సీఎం కేసీఆర్ బుధవారం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి   కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని (Dasara Bonus) మొత్తాన్ని దసరా పండుగ లోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.