ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాకలో పాదయాత్ర చేస్తున్నారు. అనంతరం తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. అక్టోబర్ 24న తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 13 రోజులపాటు జరగనుంది. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది పీసీసీ. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.


తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ షెడ్యూల్..
కాంగ్రెస్ ను మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణలో మొత్తం 13 రోజులకు రాహుల్ గాంధీ పాదయాత్రను కుదించారు. 13 రోజుల పాటు రోజు వారీగా రాహుల్ యాత్రలో పాల్గొనే నియోజకవర్గాల జాబితా కూడా సిద్ధం చేశారు. మక్తల్  నియోజకవర్గం కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు.


1వ రోజు షెడ్యూల్..
తెలంగాణలో తొలిరోజు రాహుల్ గాంధీ మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారత్ జోడో యాత్ర.. కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 


2వ రోజు షెడ్యూల్..
దేవరకద్ర నియోజకవర్గంలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట సెగ్మెంట్ నేతలతో కలిసి రాహుల్ పాదయాత్ర


3వ రోజు షెడ్యూల్..
మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో తాండూర్, పరిగి, దేవరకొండ మినహా నల్గొండ పార్లమెంట్ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలు పాల్గొంటారు.


4వ రోజు షెడ్యూల్..
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర..
నాగర్ కర్నూల్ ఖమ్మం లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు.


5వ రోజు షెడ్యూల్..
షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్రలో
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భువనగిరి లోక్ సభ లోని అసెంబ్లీ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.


6వ రోజు షెడ్యూల్..
శంషా బాద్ రీజియన్‌లో జరిగే యాత్రలో హైదరాబాద్ లోక్ సభలోని అసెంబ్లీ స్థానాలతోపాటు రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గ నేతలు రాహుల్ తో కలిసి పాదయాత్రలో ఉంటారు


7వ రోజు షెడ్యూల్..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాదయాత్రలో చేవెళ్ల లోక్ సభలోని మహేశ్వరం, రాజేంద్ర నగర్ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొంటారు.


8వ రోజు షెడ్యూల్..
బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ భారత్ జోడో పాదయాత్ర సాగనుంది. ఈరోజు మల్కాజ్ గిరి, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు యాత్రలో భాగస్వాములు అవుతారు.


9వ రోజు షెడ్యూల్..
సంగారెడ్డిలో రాహుల్ యాత్ర కొనసాగిస్తారు. మెదక్, వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలోని పార్టీ నేతలు వెంట ఉంటారు.


10వ రోజు షెడ్యూల్..
జోగి పేటలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. ఈ యాత్రలో జహీరాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని నేతలు భాగస్వాములు అవుతారు.


11వ రోజు షెడ్యూల్..
రాహుల్ పాదయాత్ర శంకరం పేట ప్రాంతంలో కొనసాగనుంది.
ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.


12వ రోజు షెడ్యూల్..
తెలంగాణలో రాహుల్ యాత్ర 12వ రోజు జుక్కల్ ప్రాంతంలో జరుగుతుంది. ఈరోజు పాదయాత్రలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలు హాజరు కానున్నారు.


13వ రోజు షెడ్యూల్..
వరుసగా రెండో రోజు జుక్కల్ లోనే రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తారు. చివరిరోజు పాదయాత్రలో కరీంనగర్ లోక్ సభ లోని అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో ముగియనుంది.