Nizamabad KTR Convoy: నిజామాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి కేటీఆర్ పర్యటన అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొత్త కలెక్టరేట్ వద్ద హెలికాఫ్టర్ లో దిగి.. భూమా కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి కేటీఆర్ బస్ లో బయలు దేరేందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కంఠేశ్వర్ వద్ద పోలీసుల కండ్లుగప్పి ఒక్కసారిగా కాన్వాయ్ కి అడ్డుపడే ప్రయత్నం చేశారు. పోలీసులు కాంగ్రెస్, బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


అంతకుముందే కోటగల్లిలో పీడీఎస్‌యూ నాయకుడు వి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులను ఈరోజు ఉదయం ముందుస్తు అరెస్టులు చేశారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కళాభారతి ఆడిటోరియానికి మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. 



 ఉదయం 11 గంటలకు రైల్వే అండ్ బ్రిడ్జి ప్రారంభించడంతోపాటు కళాభారతికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పాత కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రైల్వే కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించడంతోపాటు కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.