తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి (అక్టోబరు 5) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ ను నియమించారు. వీళ్ల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.