Telangana Graduate MLC Election :    రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, ఫించన్లు, 2 లక్షల ఉద్యోగాలు అంటూ ఇన్ని హామీలిచ్చి మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పకపోతే మనదే తప్పు అవుతదని కేటీఆర్ ప్రజల్ని హెచ్చరించారు.  వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో  కేటీఆర్ మట్లాడారు.  డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మాత్రం ఊసరవెళ్లి లాగా తేదీలు మారుస్తున్నాడని మండిపడ్డారు.  ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండో సారి మోసపోతే మాత్రం మోస పోయిన వాళ్లదే తప్పు అవుతదని..  అరచేతిలో వైకుంఠం చూపి ఆరు గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చారని  ఆరోపించారు.  


సిగ్గులేకుండా ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని..  పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఇళ్లు కట్టుకుంటే ఎంతో శ్రద్ధగా చేస్తామో అలాగే అభివృద్ధి చేశామన్నారు.  అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని..   తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది అన్నట్లుగా అభివృద్ధి చేశామన్నారు.  ఓ వైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించామన్నారు.  కేసీఆర్  ఉన్నప్పుడు పదేళ్ల పాటు కృష్ణానది ప్రాజెక్ట్ లను కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకు అప్పగించాలని ఒత్తిడి తెచ్చిన వారికి అప్పగించలేదన ిగుర్తు  చేశారు.  కానీ రేవంత్ రెడ్డి వచ్చిన నెల రోజుల్లోనే దొంగచాటుగా సంతకం పెట్టి కేఆర్ఎంబీ కి మన జుట్టును అప్పగించిండని మండిపడ్డారు. 
 
నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాల పంట ఎండిపోతుంటే...ఒక్క తడి ఇవ్వకుండా కిందికి నాలుగున్నర టీఎంసీల నీళ్లు ఎట్ల పోయినయని కేటీఆర్ పఱ్సనించారు.  ప్రశ్నించే గొంతు అని చెప్పుకునే మల్లన్న, పుల్లన్న దీనిపై ఒక్కసారైనా అడిగిండా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ నాయకుల పరిస్థితి సిట్ అంటే సిట్టు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో.  .. మీ జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈ మల్లన్న మాట్లాడగలుగుతారా అని ప్రశ్నించారు.  నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో...రేవంత్ రెడ్డి మాటల్లో కూడా అంతే నిజాయితీ ఉందని..  75 శాతం పండించే దొడ్డు వడ్లకు బోనస్ లేదంట. అంటే వీళ్ల మాటలు బోగస్ అని తేలిపోయిందన్నారు. 
 
  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో కోటి 67 లక్షల మంది మహిళలకు రూ. 2500 లు ఇస్తున్నామని పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. చేయని పనులను కూడా చేస్తున్నామని ఈ సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా చెప్పుకుంటోందని విమర్శించారు.  2014 లో ఐటీ ఉద్యోగులు ఉంటే 2023 చివరి నాటికి 10 లక్షల మంది ఉద్యోగులు అయ్యారుని..  2023 నాటికి ఐటీ ఎగుమతులు ఐదు రెట్లు పెంచామన్నారు.  పారిశ్రామిక రంగంలో కూడా ఎన్నో పెట్టుబడులు తెచ్చి దాదాపు 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు.  


 కాంగ్రెస్ తప్పుడు హామీలు, యూట్యూబ్ తప్పుడు ప్రచారాల కారణంగా స్వల్ప తేడాతో ఓడిపోయామని..  పని చేసి కూడా మనం సరిగా చెప్పుకోలేకపోయాం. అందుకే ఓడిపోయామని విశ్లేషించారు.   ఇలాంటి మోసపూరితమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పుడు అధికార స్వరాలు కాదు...ధిక్కార స్వరాలు కావాలన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి చదువుకున్నాడో లేదో తెలియదు. గానీ బ్లాక్ మెయిలింగ్ చేసే తెలివి అయితే ఉందన్నారు.  ఐఐటీలు, నిట్, ప్రభుత్వ సర్వీసులు, తెలంగాణ ఉద్యమం ఇలా అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ లో నాయకులు ఉన్నారని..  బీఆర్ఎస్ లో చదువుకున్న వారికి అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు.  ఈ నెల 27 న విద్యావంతుడైన రాకేష్ రెడ్డి కి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు.