Allu Arjun Spotted in Loacl Dhaba: ఈ మధ్య ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నారు. ఏపీ ఎన్నికల నుంచి బన్నీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇక ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డును కైవసం గెలుచుకున్నాడు. అంతేకాదు తెలుగు హీరోల్లో నేషనల్‌ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా సినీ చరిత్రలో రికార్డు క్రియేట్‌ చేశాడు. అంతటి ఘనత, రికార్డు నెలకొల్పిన బన్నీ సింప్లిసిటీ పై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. 


భార్యతో కలిసి దాబాలో


ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఐకాన్ స్టార్ ఇప్పుడు ఒక్క టాలీవుడ్‌లోనే కాదు ఇండియా వైడ్‌గా గుర్తింపు పొంది నేషనల్‌ స్టార్‌ అయ్యాడు. పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ఉన్న బన్నీ ఓ సాధారణ వ్యక్తిలా దాబాలో భోజనం చేశాడు. ఇది ఎక్కడనేది తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోల బన్నీ మాత్రమే కాదు అతడి భార్య స్నేహారెడ్డి కూడా పక్కనే ఉన్నారు. వెనకాలే వారి బాడిగాడ్ కూడా ఉన్నాడు. అంత స్టార్‌ డమ్‌ ఉన్న అల్లు అర్జున్‌ ఇలా సింపుల్‌ దాబాలో భోజనం చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇది చూసి అతడి సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. కాగా ఇది ఏపీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన సంఘటన.






ఇప్పుడు ఆలస్యంగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. కాగా ఏపీ ఎన్నికల భాగంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైస్సారిసీపీ అభ్యర్థుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అతడి తరపున ప్రచారం చేసి తన స్నేహితుడికి ఓటేసి గెలిపించాలని ఓటర్లు సూచించాడు. ఈ ప్రచారం అనంతరం తిరిగి వస్తుండగా.. ఏపీలోని ఓ దాబా బన్నీ ఇలా భార్యతో కలిసి లంచ్‌ చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ ఫోన్‌ మాట్లాడుతూ ఉండగా.. పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించింది. దీంతో వారి సింప్లిసిటీ చూసి నెటిజన్లు, ఫ్యాన్స్‌ తెగ ముచ్చటపడుతున్నారు. 


Also Read: పవిత్ర జయరాం, చందు రిలేషన్‌పై స్పందించిన ఆమె కూతురు - ఏం చెప్పిందంటే!


కాగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బీజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక్క తెలుగు ఆడియన్స్‌ మాత్రమే ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మూవీ లవర్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప,పుష్ప సాంగ్‌ యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఈ పాట మారుమోగుతుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రష్మిక హీరోయిన్‌ కాగా, మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, రావు రమేష్‌, జగపతి బాబు, యాంకర్ అనసూయ వంటి స్టార్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.