KTR On Revanth :    మూసీని మురికి కూపంగా మార్చింది గత ప్రభుత్వాలేనని అవి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని కేటీఆర్ అన్నారు.  సింహ‌భాగం కాంగ్రెస్ ప్ర‌భుత్వానిది అయితే..   కొద్దిభాగం టీడీపీ ప్ర‌భుత్వానికి కూడా ద‌క్కుతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మూసీపై కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. 1908లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ డిజైన్ చేసిన రిజ‌ర్వాయ‌ర్లు, పార్కులు త‌ప్ప కేసీఆర్ వ‌చ్చేదాకా ఏ ప్ర‌భుత్వం కూడా మూసీ ప్రక్షాళన ప్రయత్నాలు చేయలేదన్నారు. 


మూసీ ప్రక్షాళన కేసీఆర్ ప్రణాళిక 


కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు రిపోర్టు తెప్పించుకున్నామని.. బీవోడీ, సీవోడీ ఈ రెండింటిలో కూడా మూసీ ప్ర‌మాద‌భ‌రిత‌మైన స్థాయిలో ఉంద‌ని రిపోర్టు వచ్చిందని కేటీఆర్ చెప్పారు.  కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అక్క‌డ ఉండే ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి పున‌రుజ్జీవం, సుంద‌రీక‌ర‌ణ చేసే విధంగా సంక‌ల్పించామన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు తాను ఏదో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాన‌ని అనుకుని  తన పరువు తీసుకున్నారని కేటీఆర్ సెటైర్ వేశారు. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనన్నారు.   


మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్


మూసి లూటిఫికేషన్ ప్రాజెక్ట్                                


రేవంత్ ప్రభుత్వం  మూసీ లూటిఫికేష‌న్ అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయిందన్నారు.  పాపం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెప్పి రేవంత్ రెడ్డి త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నార‌ని  మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఎలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేదని స్పష్టం చేశారు.   స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లే చెబుతున్నారని కానీ రేవంత్ మాత్రం మూడు నెలల పాటు  స‌ర్వే చేస్తున్నామ‌ని అబ‌ద్ధాలు ఆడుతున్నారన్నారు. ఒక్క మట్టి పెళ్ల కూలగొట్టలేదని రేవంత్ అంటున్నారని కానీ   జేసీబీల‌తో, కూలీల‌ను పెట్టి ఇండ్లు కూల‌గొడుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో కూడా వచ్చాయన్నారు.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇండ్ల‌ను కూలగొట్టేందుకు వ‌చ్చిన ఓ కూలీ కూడా  బాధపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చాయన్నారు. 


షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు


గ్రాఫిక్స్‌తో మాయ చేసే ప్రయత్నం                        


కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపించారు.   ల‌క్ష‌న్న‌ర కోట్ల కుంభ‌ణానికి కాంగ్రెస్ నేత‌లు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు.  ఆరు గ్యారెంటీల‌ను అట‌కెక్కించారు. 420 హామీల‌తో ప్ర‌జ‌ల గొంతు కోశారన్నారు.  ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే అని తేలిపోయిందన్నారు. నోట్ల ర‌ద్దు చేసిన‌ప్పుడు మోదీ చెప్పిన మాట‌ల మాదిరిగా చోటే భాయ్ రేవంత్ మూసీపై రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.