Telangana Elections 2023: రాజకీయ పరిణితి పెరిగిన దేశాలలో ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుందని, ఎన్నికల్లో అభ్యర్థి గురించి ఆలోచించాలని కేసీఆర్ (KCR) అన్నారు. పార్టీల పని విధానం గురించి ఆలోచించాలని, ఏ ప్రభుత్వం ఉంటే మనం పని చేస్తాడని ఆలోచించాలని కేసీఆర్ (KCR) ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అని, బీఆర్ఎస్ కు ఎవ్వరూ ఎదురు లేరని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడారు. 


‘‘కాంగ్రెస్ పార్టీయే తెలంగాణను ఆంధ్రలో కలిపింది. అప్పుడు రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు వలసలు ఇలాంటి బాదకలు ఉండేవి, సిరుల సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీ, 49 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అమ్మింది కాంగ్రెస్ పార్టీ, పరిపాలన సాతగాక సింగరేణిని ముంచిండ్రు. 419 కోట్ల రూపాయల లాభాలు ఉండే. ఇప్పుడు 200కోట్ల రూపాయలు లాభం వచ్చింది. వెయ్యి కోట్లు లాభాల వాటేస్తున్నము, 2.5 లక్షలు లాభాల వాటా ఇస్తున్నాము. 40 వేల మందికి ఇండ్ల జగాలు పట్టాలు ఇచ్చాం, డిపెండెంట్ ఉద్యోగాలు ఉదకొట్టింది’’


కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, మోదీ అన్ని సంస్థలను ప్రవేటీకరణ చేసేందుకు చూస్తున్నారు. రైతులను కాంగ్రెస్ పార్టీ ముంచింది, రైతు బంధు సృష్టించింది బీఆర్ఎస్, ధరణి పోర్టల్ తెచ్చింది రైతు భూముల భద్రత కోసం తెచ్చినం, రైతు భూమిపై రైతుకే అధికారం ఇచ్చినాం, దళారీ వ్యవస్థ లేకుండా చేసినం, కాంగ్రెస్ పార్టీ కరెంటు వద్దు అంటున్నారు, రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అన్ని వర్గాల విద్యార్థుల కోసం స్కూలు పెట్టుకున్నాము.


సూట్ కేసుల నాయకులు కావాలా? అభివృద్ధి కోసం పని చేసిన సుమన్ కావాలో మీరే నిర్ణయించుకోవాలి. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ఏర్పాటు చేసినాము. దళిత బంధు ప్రతి కుటుంబానికి చేరే అంతవరకు మన ప్రభుత్వం ఉండాలి, అంబేత్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఓడకొట్టింది.



అంబేడ్కర్ ఆశయాల కోసం మేం పని చేస్తున్నాము. ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం, విధివంచితులను ఆదుకునేందుకు పెన్షన్ విధానం చేసినం, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఇస్తాం. ఆలోచన చేసి ఓటువేయలి, సింగరేణి పెర్క్స్ టాక్ట్స్ కార్మికులకు చెలిస్తాం. మందమర్రిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. పెద్ద ఎత్తున ఓట్లు వేసి సుమన్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజినమా చెసీన మాజీ మంత్రి బోడ జనార్దన్ తోపాటు పలువురు సిఎం కేసీఆర్ (KCR) సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ (KCR) వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు’’ అని కేసీఆర్ (KCR) మాట్లాడారు.