తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించిన అధినాయకత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ స్థాయిలో ఉన్నతమైన పదవిని కట్టబెట్టింది. బండి సంజయ్‌ను జాతీయ కార్యదర్శిగా నియమించింది. 


జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధినాయకత్వం పునరుద్దరించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అందులో స్థానం కల్పించారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండి సంజయ్‌కి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. ఆయనకు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.



బీజేపీ_జాతీయ_కార్యవర్గం_సభ్యులు


తెలంగాణ రాష్ట్రం నుంచే మరో లీడర్‌ డీకే అరుణకి కూడా జాతీయకార్యవర్గంలో మరోసారి చోటు లభించింది. ఆమెను జాతీయ ఉపాధ్యక్షరాలిగా కొనసాగిస్తున్నారు. ఏపీ నుంచి సత్యకుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. ఆయన్ని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలిగా చేసింది అధినాయకత్వం. అందుకే సత్య కుమార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ చేశారు.