Kadiyam Srihari On Sharmila:  జగన్ గ్రాఫ్ పడిపోతోందని.. జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ వస్తుంది..   ఏపీకి వెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుషర్మిలకు  కడియం శ్రీహరి సలహా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల బడ్జెట్‌పై విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా మీడియా సమావేశం నిర్వహించిన కడియం శ్రీహరి.. షర్మిల ఏపీలో రాజకీయాలు చేయాలనిసలహా ఇచ్చారు.  వైఎస్ కుటుంబం తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమేనని చెప్పారు. పాదయాత్ర చేసి అన్నను సీఎంను చేసిన షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలతో మొర పెట్టుకోవాలని సూచించారు. జగన్ గ్రాఫ్ పడిపోతోందని, రేపో మాపో ఆయన జైలుకు వెళ్తే షర్మిలకు పదవి దక్కే అవకాశముందని అన్నారు. 


తెలంగాణ బిల్లు ఆమోద విషయంలో వైఎస్ జగన్,షర్మిల సమైక్య నినాదానికి తెరలేపిన వారని కడియం శ్రీహరి గుర్తు చేారు. అలాంటి షర్మిల నేడు తెలంగాణలో వైఎస్ శర్మిలకు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని  ప్రశ్నించారు. షర్మిల   కుటుంబ పరంగా నష్టపోయారని.. ...తన అన్న జగన్... ఆమెను రాజకియంగా దెబ్బ తీశారన్నారు.  గతంలో శర్మిల పాదయాత్ర తోనే జగన్ సీఎం అయ్యాడన్నారు. ఆ సానుభూతి ఇక్కడ పనిచేయదు...రేపో మాపో సిఎం జగన్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయి ..కాబట్టి.. ఏపీకి వెళ్లాలన్నారు. షర్మిలకు రాజకియ భవిష్యత్తు ఆంధ్రాలో ఉంటుందన్నారు.  ఈ ప్రయత్నాలు అక్కడ చేసుకోవడం బెటర్ అని సూచించారు.  తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ షర్మిల సమయాన్ని వృథా చేసుకోవద్దని కడియం సూచించారు. కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఒరిగిందేమీ లేదు అన్న క‌డియం.. రాష్ట్ర  బ‌డ్జెట్ సంక్షేమ బ‌డ్జెట్ అని ప్రశంసించారు.   


వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల  నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల దాడులు చేయడంతో నిలిచిపోయింది.  అనంతరం షర్మిల హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావు పేట మండలం శంకరమ్మతండా వద్ద నుంచి మళ్లీ ప్రారంభించారు.  ఈ నెలాఖరు కల్లా పెండింగ్‌ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేసి మహబూబాబాద్‌ నియోజకవర్గం మీదుగా పాలేరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం రూరల్‌ మండలంలో జరగనుంది. వచ్చే ఎన్నికల్లో షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 


ఇటీవలి కాలంలో ఆమె బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగా బీఆర్ఎస్ నేతలు దాడుల కూడా చేశారు. రెండో సారి పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా పలు చోట్ల పాదయాత్ర రూట్‌లో ఆమె ఫ్లెక్సీలు చించి వేయడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. వారందరికీ..  షర్మిల సవాల్ చేసి.. పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని ముందుకు సాగుతున్నారు.