Varalakshmi Tiffins News: వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ బాధితురాలు గత జనవరిలో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. ప్రభాకర్ రెడ్డి పై 417, 420, 354A కింద కేసులు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.