TSPSC పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చింది సిట్. అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లను సాక్షులుగా చేర్చారు. ఈ జాబితాలో కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ యజమాని, సిబ్బంది కూడా ఉన్నారు. ఆ హోటల్లోనే A6 నీలేష్, A7 గోపాల్‌, వారితో పాటు ఢాక్యా బస చేశారు. హోటల్లో క్వశ్చన్ పేపర్ చూసి ఇద్దరు ప్రిపేర్‌ అయ్యారు. నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి ఎగ్జామ్ రాశారు.  


 A1- A12 నిందితులు ఎవరు? ఎక్కడివారు? ఏం చేస్తుంటారు?


A1 పులిదిండి ప్రవీణ్ కుమార్. వయసు 32 సంవత్సరాలు. టీఎస్‌పీస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆపీసర్, సెక్రటరీకి పీఏ. సొంతూరు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్.


A2 రాజశేఖర్‌రెడ్డి. 35 ఏళ్లుంటాయి. టీఎస్‌పీఎస్సీలో నెట్ వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. సొంతూరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామం.


A3 రేణుకా రాథోడ్. వయసు 30. సాంఘిక సంక్షేమ పాఠశాలలో హిందీ టీచర్. సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ పంచంగల్ తండా.


A4 లావుడ్యావత్ ఢాక్యా. వయసు 38. వికారాబాద్ R&Dడిపార్టుమెంటులో టెక్నికల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ పంచంగల్ తండా.


A5 కేతావత్ రాజేశ్వర్. వయసు 33 ఏళ్లు. వ్యవసాయం చేస్తుంటాడు. సొంతూరు మన్సూర్ పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా


A6 కేతావత్ నీలేష్ నాయక్. 28 ఏళ్లు. పుణెలో సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సొంతూరు మన్సూర్‌పల్లి తండా, గండీడ్‌ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.


A7 పత్లావత్ గోపాల్ నాయక్‌. 29 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. స్వగ్రామం పులిచర్లకుంట తండా, బొమ్రాస్ పేట మండలం, వికారబాద్ జిల్లా.


A8 కె.శ్రీనివాస్. వయసు 30. మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సొంతూరు మన్సూర్‌పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.


A9 కేతావత్ రాజేందర్ నాయక్. 31 సంవత్సరాలు. పుణెలో స్వయం ఉపాధి కింద రకరకాల పనులు చేస్తుంటాడు. సొంతూరు మన్సూర్‌పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.


A10 షమీమ్. 43ఏళ్లుంటాడు. TSPSCలో ASOగా పనిచేస్తున్నాడు. ఉండేది గుంటిజంగయ్య కాలనీ, ఎల్బీనగర్‌, హైదరాబాద్.


A11 నాలగొప్పుల సురేష్‌. వయసు 30. స్టూడెంట్. సొంతూరు పోతారం విలేజ్, తరిగొప్పుల మండలం, జనగామ జిల్లా.


A 12 దామెర రమేష్‌ కుమార్. వయసు 34. TSPSC ఆఫీసులో డాటా ఎంట్రీ ఆపరేటర్. స్వగ్రామం కోమటిపల్లి, మంగపేట మండలం, ములుగుజిల్లా.


వీరిలో A10 షమీమ్, A11 సురేష్‌, A12 రమేశ్ మార్చి 22న అరెస్టయ్యారు. A1 నుంచి A 9 వరకు పేర్కొన్న నిందితులు మార్చి 13న అరెస్టయ్యారు. వారిని మార్చి 18న పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు.


విచారించిన సాక్షులు ఎవరు? ఏం చేస్తుంటారు?


మొత్తం 19 మందిని సాక్షులుగా విచారించారు.


వీరిలో శంకరలక్ష్మీ TSPSC కాన్ఫిడెన్షియల్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తోంది.


సత్యనారాయణ TSPSC అడ్మిన్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా వర్క్‌ చేస్తున్నాడు.


అనురాజ్‌ TSPSCలో జూనియర్ అసిస్టెంట్.


హరీష్ కుమార్, TSPSCలో సాఫ్ట్ వేర్ డెవలపర్.


ఎస్‌.కే ముజాహిద్, ఆర్ స్క్వేర్ హోటల్లో సీసీ కెమెరా విభాగంలో టెక్నీషియన్.


ప్రశాంత్, ఆర్ స్క్వేర్ హోటల్లో రిసెప్షనిస్ట్, A6, A7 నిందితులకు రూం కేటాయించాడు.


రాఘవేందర్ రెడ్డి ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని.


అనిల్ కుమార్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్.


విజయ్ కుమార్ డీఈవో ఆఫీసులో జూనియర్ అసిస్టెంటు.


పూజారి నరేందర్, పంచాయతీ సెక్రటరీ.


బసంత్. ఇతను కూడా పంచాయతీ సెక్రటరీ.