IAS Officers Transfers: తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది. గతంలో ఎన్ఎండీసీ ఛైర్మన్ గా పని చేసిన ఎన్ శ్రీధర్ (Sridhar)ను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. పశుసంవర్ధక శాఖ  సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌ కుమార్‌, వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా టి.వినయ్‌ కృష్ణారెడ్డిని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా  హరీశ్‌, టీఎస్‌ఐఆర్డీ సీఈవోగా  పి.కాత్యాయని దేవి, గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌ను నియమించింది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.