Hyderabad New CP : తెలంగాణలో పలువురు ఐపీఎస్ ఆఫీసర్స్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ను తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటి వరకు సీపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన్ని విజిలెన్స్ డీజీగా పంపించారు. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్‌ను బదిలీ చేసింది. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: Weather Latest Update: తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు- మరో రెండు రోజులు కుండపోతే!