తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్‌ జోన్‌ను పునర్విభజన చేశారు. శంషాబాద్ జోన్ ను రెండు జోన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్‌ జోన్‌ను రెండుగా విభజించి, కొత్తగా రాజేంద్రనగర్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఇకనుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లుగా సేవలు అందించనున్నాయి. ప్రభుత్వం విభజించిన ప్రకారం ఈ కొత్త జోన్‌ రాజేంద్రనగర్ లో చేవెళ్ల, రాజేంద్రనగర్‌ డివిజన్లు ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.


కొత్త జోన్ రాజేంద్రనగర్ ఏర్పాటు చేస్తూ జీవో.. 
రాష్ట్ర డీజీపీ తెలంగాణ ప్రభుత్వానికి శంషాబాద్ జోన్ పునర్ విభజనపై రిపోర్ట్ అందించారు. దీనికి సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ను శంషాబాద్, రాజేంద్ర నగర్ రెండు జోన్లుగా విభజించింది. దాంతో సైబరాబాద్ కమిషనరేట్ లో కొత్త జోన్ రాజేంద్రనగర్ ఏర్పడింది. ఈ జోన్ ప్రధాన కేంద్రంగా రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్ పోలీసులు సేవలు అందించనున్నారని జీవోలో పేర్కొన్నారు.