విద్యార్థుల కోసం స్టూడెంట్‌ పాస్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది హైదరాబాద్‌ మెట్రో. ఈ పాస్ తీసుకున్న విద్యార్థులు 20 ట్రిప్‌లకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్‌లు జర్నీ చేయవచ్చు. ఇప్పుడు మెట్రో ట్రైన్ పాస్ తీసుకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందుబాటు ఉంటుంది. 


పది స్టేషన్‌లలో ఈ పాస్‌లు ఇవ్వనున్నారు. జేఎన్‌టీయూ, విక్టోరియా మెమోరియల్‌, నాగోల్, రాయ్‌దుర్గ్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, బేగంపేట్‌, పరేడ్‌ గ్రౌండ్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్‌ స్టేషన్‌లలో స్టూడెంట్‌ మెట్రో పాస్‌లు ఇస్తారు. 


పాస్ తీసుకోవడానికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓ ఫామ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిఉంటుంది. అందులో వివరాలు ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్‌తోపాటు ప్రస్తుతం చదువుతున్న స్కూల్‌, కాలేజ్‌ ఐడీ కార్డ్‌ జిరాక్స్ ఇవ్వాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా సబ్‌ మిట్ చేయాలి. ప్రిన్సిపల్ సంతకం చేసిన బోనఫైడ్‌ సర్టిఫికెట్ కూడా జత చేయాలి. 


కండిషన్స్‌ ఏంటంటే?
1. మెట్రో స్టూడెంట్ పాస్ అనేది పరిమితమైన ఆఫర్
2. విద్యార్థికి పాస్ కార్డు ఇచ్చేందుకు రూ.100 తీసుకుంటుంది. 
3 .విద్యార్థి వారి అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. 
3. ట్రిప్ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది
4. 1 ఏప్రిల్, 1998 తర్వాత పుట్టిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 
5. 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఉంటుంది. 
6. ఒకసారి ఎంటర్ అయి వస్తే ట్రిప్ బ్యాలెన్స్ నుంచి ఒక ట్రిప్ తీసేస్తారు. 
మీ స్మార్ట్ కార్డ్‌లో రూ. 45/- లోడ్ చేస్తే 15 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి. ఒకసారి మీరు ఎంటర్‌ అయితే మీ కార్డులో 14 ట్రిల్‌లే ఉంటాయి. 
7. ఒరోజులో కార్డులో ఇచ్చిన దాని కంటే ఎక్కువ ట్రావెల్ చేస్తే మాత్రం అదనంగా చెల్లించాల్సిన ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. మీ స్మార్ట్ కార్డ్‌ను రూ.45/- తో లోడ్ చేస్తే 15 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి. మీరు ఓ రోజు ఓవర్‌ ట్రిప్స్ వెళ్తే రూ. 55/- అవుతుంది. మీ ట్రిప్ బ్యాలెన్స్ నుంచి ఒకటి కట్‌ చేయడంతోపాటు అదనంగా పది రూపాయలు చెల్లించాలి. 
8. స్మార్ట్ కార్డ్‌లో ఒక ఫేర్ జోన్ ట్రిప్ పాస్ మాత్రమే అప్‌లోడ్ చేస్తారు. అంటే స్టేషన్ల పేర్లు ముందే చెప్పాల్సి ఉంటుంది.