Congress SC ST Declaration: చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ (ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్) ప్రకటించింది. దళిత, గిరిజన విద్యార్థులు పది పాసయితే 10వేలు... ఇంటర్ పాసయిన విద్యార్థులకు 15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25 వేలు, పీజీ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలు నగదు ఇస్తామని హామీ ఇచ్చింది. 12 లక్షల రూపాయలతో దళితబంధు అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. 


చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ 
చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ ప్రకటించింది. దళిత, గిరిజన విద్యార్థులు పది పాసయితే 10వేలు... ఇంటర్ పాసయిన విద్యార్థులకు 15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25 వేలు, పీజీ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలు నగదు ఇస్తామని హామీ ఇచ్చింది. 12 లక్షల రూపాయలతో దళితబంధు అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. 


ఎస్సీ రిజర్వేషన్ల పెంపు-ఎస్సీవర్గీకరణ
జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 18శాతానికి పెంపు, ఎస్సీ రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణకై అమలుకై గట్టి చర్యలు
అంబేద్కర్ అభయ హస్తం
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం అందజేత. వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించి, పూర్థిస్థాయిలో పథకం అమలు
ప్రత్యేక రిజర్వేషన్లు
ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్, అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో , ప్రభుత్వ ప్రొత్సాహాకాలను పొందే ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన
ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం
ఇళ్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల అందజేత. ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు
అసైన్డ్ భూముల పునరుద్ధరణ-సమాన హక్కులు
బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరణ.
ప్రజా ప్రయోజనార్థం భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినపుడు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం.
పోడు పట్టాల పంపిణీ
సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, అర్హులైన అందరికి పోడు పట్టాలు పంపిణీ.
సమ్మక-సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతిగూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షలు కేటాయింపు
ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి...  మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు. ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్ కు 750 కోట్ల నిధుల మంజూరు
ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి... తుకారం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబడా కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్ కు 5వందల కోట్ల నిధుల మంజూరు
కొత్త ఐటీడీఏలు-9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ కొత్త ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపన
విద్యాజ్యోతుల పథకం కింద పది పాసయితే 10వేలు...ఇంటర్ పాసయిన విద్యార్థులకు 15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25 వేలు, పీజీ పూర్తి చేసిన వారికి లక్ష, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు నగదు
రెసిడెన్షియల్  స్కూళ్లు, హస్టల్స్ విదేశాల్లో విద్య
ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
ఫీజు రీయింబర్స్ మెంట్ పతకాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో పాటు గ్రాడ్యూయేషన్, పోస్ట్ గ్రాడ్యూయేషన్ చదివే ఎస్సీ, ఎస్సీ విద్యార్థులందరికి హాస్టల్ సదుపాయం కల్పన.
విదేశాల్లోని యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం అందజేత