Telangana Formation Day  Event: పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బయల్దేరి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. వేడకగా నిర్వహిస్తున్న ఆవిర్భావ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు.