గద్వాల్‌లోని ఎర్రవల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పాట్‌లోనే నలుగురు మృతి చెందారు. లారీనీ వేగంగా వచ్చిన స్కార్పియో ఢీ కొట్టింది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 


మరో ప్రమాదంలో కందుకూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్‌ పల్నాడులో బోల్తా పడింది. చిలకలూరిపేట మండలం లింగంగుట్ల వద్ద 40 మందితో వెళ్తున్న ట్రావెల్స్ బస్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు