Train accident at gaudavelli station in Medchal District | హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ లో ఆదివారం తండ్రి, ఇద్దరు కుమార్తెలను రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ గౌడవెల్లిలో రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ చెకింగ్ పని చేస్తాడని స్థానికులు తెలిపారు. అయితే ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని పనికి వెళ్లాడు. రోజులాగే కృష్ణ పనిచేస్తుండగా తన కూతుళ్లు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పట్టాలపై రైలు రావడాన్ని గమనించిన కృష్ణ.. ఇద్దరు కూతుర్లను కాపాడబోగా మొత్తం ముగ్గురు దుర్మరణం చెందారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణి అని స్థానికులు తెలిపారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Also Read: Viral News: బరువు 50 గ్రాములే, విలువ మాత్రం రూ.850 కోట్లు - ముగ్గురి అరెస్ట్, ఏమిటా పదార్థం?