తెలంగాణలో మరో పరువు హత్య సంచలనం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతోనే తల్లిదండ్రులు తమ బిడ్డను చంపుకున్నారని పోలీసులు తేల్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. 


అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో 21 ఏళ్ల యువతి హత్య సంచలనంగ మారింది. పవర్ రాజేశ్వరి అనే యువతిని అతి దారుణంగా ఇంట్లో హత్యకు గురైంది. యువతి గోంతుపై కత్తితో చేసిన గాయాలు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్నా ఆమెది హత్యగానే పోలీసులు నిర్దారించారు. 


ఇంట్లో అనుమానాస్పద స్థితిలో తమ బిడ్డ చనిపోయి ఉందని తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన తీరును చూసిన పోలీసులు... ఇది కచ్చితంగా హత్యగానే అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగానే దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. తండ్రే ఈ హత్య చేసినట్టు తేల్చారు. 


అన్యమతస్తున్ని ప్రేమించినదన్న కక్షతోనే తండ్రి ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. అందర్నీ తప్పుదారి పట్టించడానికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఓసారి... ఆత్మహత్య చేసుకుందని మరోసారి బురిడీ కొట్టించేందుకు తండ్రి దేవీదాస్‌ కట్టుకథలు చెప్పాడు. మొదటి నుంచి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమ స్టైల్‌లో విచారిస్తే అసలు విషయం చెప్పినట్టు తెలుస్తోంది. 


తన చేతులతో తానే చంపానని పోలీసులకు రాజేశ్వరి తండ్రి దేవీదాస్‌ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ మతం కాని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ కుటుంబం పరువు తీసిందన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పుకొచ్చాడు. 


మూడు నెలల క్రితం వేరే మతస్తుడిని రాజేశ్వరి పెళ్లి చేసుకుంది. దీనికి పెద్దలు అంగీకరించలేదు. అప్పటి నుంచి వాళ్లిద్దర్నీ విడదీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భయపెట్టి వాళ్లను విడదీయలేమని గ్రహించిన దేవీదాస్‌... ప్రేమ నటించి బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇరు వర్గాల పెద్దలను పిలిచి ఇద్దర్నీ విడదీసేందుకు ప్లాన్ చేశాడు దేవీదాస్. 


అనుకున్నట్టుగానే అందర్నీ బలవంతంగా ఒప్పంచి కట్టుకథలు చెప్పి రాజేశ్వరిని ఆమెను భర్త నుంచి వేరు చేయగలిగాడు దేవీదాస్. రెండు వారల క్రితం తను అనుకున్నట్టుగానే ఇద్దరీ విడదీస్తూ పెద్దలు అంగీకరించారు. అప్పటి నుంచి రాజేశ్వరి ఇంట్లో ఒకటే గొడవ. తన భర్త తనకు కావాలంటూ రోజూ గొడవ పడుతూనే ఉంది. 


ఇవాళ ఉదయం కూడా మరోసారి పెద్ద ఘర్షణ జరిగింది. దీంతో రాజేశ్వరిని ఒప్పించలేనని గ్రహించిన దేవీదాస్‌.. కుమార్తెను హత్య చేశాడు. తల్లి ఎదురుగా ఉండగానే రాజేశ్వరిని అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. అయినా పోలీసుల ముందు దొరికిపోయాడు.